- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీసీ సమ్మేపై సర్వత్రా ఉత్కంఠ.. యాజమాన్యం నుంచి JAC నేతలకు పిలుపు
ఆర్టీసీ జేఏసీ నేతలకు యాజమాన్యం నుంచి చర్చలకు పిలుపు అందింది. ఈడీ వెంకన్న, సీపీఎం ఉషాదేవి నేతలతో ఫోన్లో మాట్లాడారు.

దిశ, వెబ్డెస్క్: ఆర్టీసీలో నెలకొన్న సమస్యల పరిష్కారమే ధ్యేయంగా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జేఏసీ (JAC) నాయకులతో చర్చలు జరిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ మేరకు చర్చలకు రావాల్సిందిగా జేఏసీ నేతలకు సమాచారం అందించారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED) వెంకన్న, ఆర్టీసీ సీపీఎం (CPM) ఉషాదేవి స్వయంగా జేఏసీ నాయకులకు ఫోన్ చేసి చర్చలకు పిలిచారు. కార్మికుల డిమాండ్లు, సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే, చర్చలకు సంబంధించిన ఖచ్చితమైన సమయం, వేదికను మరికొద్దిసేపట్లో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. అప్పటి వరకు నాయకులందరూ అందుబాటులో ఉండాలని ఆర్టీసీ యాజమాన్యం జేఏసీకి సూచించింది. ఈ క్రమంలోనే చాలాకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు తాజా చర్చలతో కొలిక్కి వస్తాయని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మీకులు సమ్మేకే మొగ్గు చూపితే.. ప్రత్యామ్నాయం ఏమిటా అని ప్రజలు గుబులు పడుతున్నారు.






