BREAKING: ఈ రోజు నుంచి 3 నెలల వరకు పెళ్లిళ్లకు బ్రేక్.. ఎందుకంటే?

by Disha Web Desk 12 |
BREAKING: ఈ రోజు నుంచి 3 నెలల వరకు పెళ్లిళ్లకు బ్రేక్.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి వచ్చిందంటే చాలు ఎన్నడూ లేనివిధంగా ఎక్కడ చూసిన వివాహాలు జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలంలోనే ముహుర్తాలకు అత్యధికంగా వివాహాలు చేసుకుంటారు. ఈ క్రమంలోనే మార్చి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువ జంటలకు వివాహాలు జరిగాయి. ప్రతి సంవత్సరం మే నెలలో అత్యధిక వివాహాలు జరుగుతుంటాయి. కానీ ఈ సారి ఆ అవకాశం లేదు. అధిక మూడాల కారణంగా.. ఏప్రిల్ 29 నుంచి ఆగస్టు 4 వరకు అంటే దాదాపు మూడు నెలల పాటు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లకు బ్రేక్ పడింది. ఈ మూడాలపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా వివరణ ఇస్తున్నారు. అందులో.. ముఖ్యంగా సూర్యకాంతి గురు, శుక్ర గ్రహాలపై పడి ఈ మౌఢ్యమి సంక్రమిస్తుందని.. ఈ సమయంలో ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహుర్తాలు పెట్టడం సాధ్యం కాని పురోహితులు వివరిస్తున్నారు.

Next Story