వాహనదారులకు BIG అలర్ట్.. పెండింగ్ చలాన్ క్లియర్ చేశారా?

by Disha Web Desk 2 |
వాహనదారులకు BIG అలర్ట్.. పెండింగ్ చలాన్ క్లియర్ చేశారా?
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: మరో 48 గంటల్లో వాహనాలకు సంబంధించిన చలాన్ల డిస్కౌంట్​ఆఫర్​ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు చలాన్లు చెల్లించని వారు వెంటనే చెల్లించాలంటూ పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇక ముందు చలాన్ల చెల్లింపునకు సంబంధించిన గడువు పెంపు ఉండదని స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్​ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న చలాన్లను క్లియర్​చేయటానికి భారీ డిస్కౌంట్​ఆఫర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్​27వ తేదీన ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. మొదట పదిహేను రోజులపాటు గడువు ఇచ్చారు. ఆ సమయానికి రాష్ర్టం మొత్తం మీద 3.59 కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, డిస్కౌంట్​ఆఫర్​ప్రకటించిన తరువాత వాహనదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ క్రమంలో ట్రాఫిక్ ఎక్కువై చలాన్ల చెల్లింపు కోసం అందుబాటులోకి తెచ్చిన వెబ్​సైట్లు క్రాష్​కూడా అయ్యాయి.

ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు చలాన్ల చెల్లింపు గడువును ఈనెల 31వ తేదీ వరకు పొడిగించారు. ట్రాఫిక్​పోలీస్​ఈ చలాన్​విభాగం ఇన్​ఛార్జ్​సీఐ అనిల్‌తో మాట్లాడగా ఈనెల 28వ తేదీ రాత్రి వరకు రాష్ర్టవ్యాప్తంగా 1.53 కోట్ల చలాన్లు క్లియర్​అయినట్టు చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు రూ.136 కోట్ల రూపాయలు సమకూరాయన్నారు. హైదరాబాద్​కమిషనరేట్​పరిధిలో 34.50 కోట్లు, సైబరాబాద్​కమిషనరేట్​పరిధిలో 25.25కోట్లు, రాచకొండ కమిషనరేట్​పరిధిలో 16 కోట్ల రూపాయలు వసూలైనట్టుగా వివరించారు. మొత్తం ఎన్ని చలాన్లు క్లియర్​అయ్యాయి? ఎంత మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరింది? అన్న పూర్తి వివరాలు వచ్చనెల 2వ తేదీన వెల్లడి కావచ్చన్నారు. కాగా, గత ప్రభుత్వం 75 శాతం డిస్కౌంట్​తో ఆఫర్​ను ప్రకటించినపుడు అప్పట్లో పెండింగ్​లో ఉన్న చలాన్లలో 65 శాతం క్లియర్​అయ్యాయి. ఈ క్రమంలో 300 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమయ్యాయి.

Next Story