TG News : తెలంగాణ RTI కమిషనర్లనియామకం

by Muthe.Rajitha |   (  Updated:2025-05-12 10:35:22  IST  )

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

TG News : తెలంగాణ RTI కమిషనర్లనియామకం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సమాచార శాఖ(RTI)లో నలుగురు కమిషనర్లను(Commissionors) నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. గత రెండున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న ఈ పదవుల్లో పీవీ శ్రీనివాస్ రావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, మోహసిన్ పర్వీన్, దేశాల భూపాల్ లను కమిషనర్లుగా నియమిస్తూ రాష్ట్ర సీఎస్ రామకృష్ణా రావు(CS Ramakrishna Rao) ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వీరంతా మూడేళ్లు పదవిలో కొనసాగుతారు. కాగా ఇదివరకే సమాచారశాఖ ప్రధాన కమిషనర్ గా జి. చంద్రశేఖర్ రెడ్డిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.

Next Story