- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మరోసారి ఎల్ఆర్ఎస్ గడువు పెంపు
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) విషయంలో తెలంగాణ సర్కార్ (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్డెస్క్: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) విషయంలో తెలంగాణ సర్కార్ (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. 25 శాతం రాయితీతో క్రమబద్ధీకరణకు మరోసారి ఈ నెల 30 వరకు గడవును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, మే 31తో గడువు ముగియగా అధికారుల అభ్యర్థన మేరకు ఈనెల 30 వరకు పొడిగించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఇలంబర్తి (Ilambarti) అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో స్థలాల క్రమబద్ధీకరణకు గత ప్రభుత్వంలోనే అనుమతి ఇవ్వగా దాదాపు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అందులో ఇప్పటి వరకు 7 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లించారు. దీంతో ప్రభుత్వానికి రూ.2 వేల కోట్ల ఆదాయం సమకూరింది. మొత్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో మరో రూ.10 వేల కోట్ల ఆదాయం రానుంది. కాగా, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ముఖ్య ఉద్దేశం ఇల్లీగల్గా ఏర్పాటైన ప్లాట్లను క్రమబద్ధీకరించడం, తద్వారా ప్లాట్ యజమానులకు చట్టపరమైన గుర్తింపు కల్పించడమే లక్ష్యం. అదేవిధంగా ప్లాట్ యజమానులు తమ ప్లాట్లను అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, ఆస్తి హక్కులను పొందేందుకు ఎల్ఆర్ఎస్ దోహదపడుతుంది.






