- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG : గూగుల్తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం
తెలంగాణ రైజింగ్ (Telangana Rising)పేరుతో పెట్టుబడుల(Investments) సాధన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) చేపట్టిన ప్రయాణంలో కీలక ముందడుగు పడింది

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రైజింగ్ (Telangana Rising)పేరుతో పెట్టుబడుల(Investments) సాధన దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) చేపట్టిన ప్రయాణంలో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ లో ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిన గూగుల్ (Google) ఇందుకు సంబంధించిన ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వంతో ఎంవోయూ(MOU) చేసుకుంది. టీ హబ్ లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)ల సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కృత్రిమ మేధ అంకుర పరిశ్రమలకు గుగూల్ తోడ్పాటునందించనుంది. వ్యవసాయం, విద్య, రవాణ రంగం, ప్రభుత్వ డిజిటల్ కార్యకలాపాలకు గూగుల్ ఏఐ కేంద్రం సహకరిస్తుందని ఆ సంస్ధ ప్రతినిధులు వెల్లడించారు.
ఇదే రోజున మైక్రోసాఫ్ట్తో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ అగ్రిమెంట్ చేసుకుంది. దీంతో మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి. ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని.. మైక్రోసాఫ్ట్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో తెలంగాణ, మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించనున్నట్లు ఆయన వెల్లడించారు.
అంతకు ముందు డిసెంబర్ లో దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని హైదరాబాద్ లో నెలకొల్పనున్న సంగతిని గూగుల్ ప్రకటించడం గమనార్హం.






