అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు.. చీఫ్ గెస్టులుగా రాహుల్, రేవంత్!

by Disha Web Desk 19 |
అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు.. చీఫ్ గెస్టులుగా రాహుల్, రేవంత్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికాలోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ వైస్ ​ప్రెసిడెంట్ ​చామల కిరణ్ ​కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాలో జరిగే ఈ వేడుకలకు కాంగ్రెస్​పార్టీ అగ్రనేత రాహుల్​గాంధీ, టీపీసీసీ చీఫ్​రేవంత్ రెడ్డిలు పాల్గొననున్నట్లు వెల్లడించారు.

2వ తేదీ వాషిగ్టంన్‌లో జరిగే సభకు రేవంత్ రెడ్డి చీఫ్​గెస్టుగా రానుండగా, 4వ తేదిన న్యూయర్క్‌లో జరిగే సభకు రాహుల్​గాంధీ హజరు కానున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎన్‌ఆర్​ఐలు, ఇతర ప్రతినిధులందరినీ ఆ సభలకు ఆహ్వానించినట్లు కిరణ్​కుమార్​రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తున్న నీళ్లు, నియామకాలు, నిధులు అంశంపై చర్చ జరుగుతుందన్నారు. అంతేగాక బీజేపీ, బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయంలో జరుగుతున్న అన్యాయాలపై కూడా డిస్కన్షన్స్​ఉంటాయని స్పష్టం చేశారు.

ఆవిర్భావ దినోత్సవ కమిటీలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను సజావుగా నిర్వహించేందుకు కాంగ్రెస్​పార్టీ ఆవిర్భావ దినోత్సవ కమిటీలను ఏర్పాటు చేసింది. చైర్మన్‌తో పాటు ఇద్దరు కో చైర్మన్లు, ఇద్దరు కన్వీనర్లు, ఐదుగురు కో ఆర్డినేటర్లు, 19 మెంబర్లతో జంబో కమిటీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్​పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలన్నింటినీ ఈ కమిటీ మానిటరింగ్ చేస్తుంది.


Next Story

Most Viewed