TG: ఫలితాలు విడుదల.. ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే?

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-25 16:41:19  IST  )

తెలంగాణ ఈసెట్-2025 పరీక్షలో 93.87 శాతం మంది విద్యార్థులు క్వాలిఫైడ్​అయ్యారని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్​వి. బాలకిష్టారెడ్డి తెలిపారు.

TG: ఫలితాలు విడుదల.. ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఈసెట్-2025 పరీక్షలో 93.87 శాతం మంది విద్యార్థులు క్వాలిఫైడ్​అయ్యారని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్​వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్​కామన్​ఎంట్రన్స్​టెస్ట్ (ఈసెట్) ఫలితాలను ఉస్మానియా ఇంజినీరింగ్​కాలేజీలో ఆదివారం ఆయన విడుదల చేశారు. ఇంజనీరింగ్​కోర్సుల్లో ప్రవేశాలకు ఈసెట్​పరీక్షను ఈ నెల 12న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్​డిప్లొమా, బీఎస్సీ మాథమెటిక్స్​అభ్యర్థులకు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలోకి ప్రవేశాలు కల్పిస్తారు. టీజీ ఈసెట్​–2025లో మొత్తం 19,672 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, ఇందులో 18928 మంది హాజరు అయ్యారని వీరిలో 17768 మంది (93.87) శాతం క్వాలిఫైడ్​అయినట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్​వి.బాలకిష్టారెడ్డి వెల్లడించారు.

సబ్జక్టుల వారీగా వివరాలను పరిశీలిస్తే కెమికల్​ఇంజనీరింగ్‌లో 103 మంది దరఖాస్తు చేసుకోగా, 93 మంది పరీక్షలకు హాజరైనారు. వీరిలో 85 మంది (91.40) శాతం క్వాలిఫైడ్​అయ్యారు. సివిల్​ఇంజినీరింగ్‌లో 2578 మంది దరఖాస్తు చేసుకోగా, 2477 మంది పరీక్షలకు హాజరైనారు. వీరిలో 2389 మంది(96.45) శాతం క్వాలిఫైడ్​అయ్యారు. కంప్యూటర్ సైన్స్​అండ్​ఇంజినీరింగ్‌లో 4879 మంది దరఖాస్తు చేసుకోగా, 4728 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4522 మంది (95.64 ) శాతం క్వాలిఫైడ్​అయ్యారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్​ఇంజినీరింగ్‌లో 5336 మంది దరఖాస్తు చేసుకోగా, 5138 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4774 మంది (92.92 ) శాతం క్వాలిఫైడ్​అయ్యారు.

Next Story