దక్షిణ తెలంగాణకు అన్యాయం జరగొద్దు: కాంగ్రెస్

by Gantepaka Srikanth |

భవిష్యత్‌లో చేపట్టబోయే డీలిమిటేషన్‌లో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని నేతలు అభిప్రాయపడ్డారు.

దక్షిణ తెలంగాణకు అన్యాయం జరగొద్దు: కాంగ్రెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: భవిష్యత్‌లో చేపట్టబోయే డీలిమిటేషన్‌లో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని నేతలు అభిప్రాయపడ్డారు. గాంధీభవన్‌లో సోమవారం సీడబ్ల్యూసీ మెంబర్ వంశీ చందర్ అధ్యక్షతన టీపీసీసీ డీలిమిటేషన్ తొలి సమావేశం జరిగింది. ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ అంశంపై తీసుకోవాల్సిన విధి విధానాలను చర్చించారు. భవిష్యత్‌లో చేపట్టబోయే డీలిమిటేషన్ కార్యక్రమంలో దక్షిణ తెలంగాణకు అన్యాయం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రధానంగా చర్చించారు.

Next Story