ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయం ఇదే!

by Disha Web Desk 2 |
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి మండలి సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో భేటీ అయిన కేబినెట్‌లో పలు అంశాలపై కీలక చర్చ జరిగింది. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 14 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పాటు.. ఇతర స్కీంలపై కూడా చర్చించింది. కాగా, మరికాసేపట్లో మహాలక్ష్మి స్వశక్తి మహిళా కార్యక్రమం ప్రారంభం కానుంది. సికింద్రబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా సంఘాలకు సీఎం వడ్డీలేని రుణాలను ప్రకటించనున్నారు.



Next Story

Most Viewed