- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నాకే మద్దతు ఇవ్వండి....!! టీఆర్ఎస్ నాయకులతో రాత్రిపూట చర్చిస్తున్న బీజేపీ నేత
దిశ, ముస్తాబాద్: నాకే మద్దతు ఇవ్వండి అంటూ ఓ బీజేపీ నేత టీఆర్ఎస్ నాయకులతో రహస్య చర్చ జరుపుతుండటం చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ లో సెస్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మండలంలో బరిలో ఉండే అభ్యర్థులు ఎవరికి వారు గుట్టుచప్పుడు కాకుండా పార్టీలతో సంబంధం లేకుండా అప్పటికప్పుడు మండలంలో సమావేశాలు పెట్టుకోవడం చేస్తున్నారు. ఓ బీజేపీ నేత టీఆర్ఎస్ నాయకుల వద్దకు చేరి రహస్య మంతనం జరుపుతూ సెస్ ఎన్నికల బరిలో తాను పోటీ చేస్తున్నానని.. తనకే మద్దతు ఇవ్వండి అంటూ వారితో సంభాషణలు చేసినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరెవరు పోటీ చేయదల్చుకున్నారో పేర్లు బయటకు పొక్కడంలేదు. దీనినే అదును చేసుకుని ఆ సదరు బీజేపీ నాయకుడు టీఆర్ఎస్ నాయకులతో భేటి కావడం, వారి మద్దతు కావలనడం.. వారు కూడా మద్దతు ఇచ్చినట్లే అక్కడ సమావేశంలో చర్చలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ఇప్పటివరకు కాంగ్రెస్ నుండి దీటి నర్సింహులు, మరికొందరు, బీజేపీ నుండి కూడా ఒకరిఇద్దరు సెస్ బరిలో ఉండబోతున్నట్లు వినికిడి.
Read more:
MLA Purchase Case: : 'బండి సంజయ్ పేరు చెప్పాలని వేధిస్తున్నారు'