ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు.. కేసీఆర్ కు జానారెడ్డి కౌంటర్

by Disha Web Desk 13 |
ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు.. కేసీఆర్ కు జానారెడ్డి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండే పరిస్థితి లేదని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి సర్కార్ కు ఎటువంటి ఢోకా లేదన్నారు. ప్రజలే పట్టుకొమ్మలై కాంగ్రెస్ కు అండగా నిలిచారని, ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నం చేస్తే అలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతాన్నారు. బుధవారం ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడిన జానారెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ బీఆర్ఎస్ నేతలు ఈ విధంగానే ఊదరగొట్టారని కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్ కు అండగా నిలిచారని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్ సభ ఎన్నికల్లో పునరావృత్తం అవుతాయని జోస్యం చెప్పారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ప్రజల మద్దతు తమకే ఉందన్నారు.


Next Story

Most Viewed