పార్లమెంట్ ఎన్నికల వేళ నేరేళ్ల బాధితుల సంచలన నిర్ణయం..

by Disha Web Desk 4 |
పార్లమెంట్ ఎన్నికల వేళ నేరేళ్ల బాధితుల సంచలన నిర్ణయం..
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పార్లమెంటు ఎన్నికల వేళ కరీంనగర్‌లో ఆయా రాజకీయ పార్టీలకు భారీ షాక్ తగలనుంది. లోక్ సభ ఎన్నికలకు కరీంనగర్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థిగా నేరేళ్ల భాదితుల పక్షాన వారి మద్దతుతో బాధితుడు కోల హరీష్ బరిలో ఉంటున్నట్లు తెలిపారు. తమకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వాలు మారిన న్యాయం జరగడం లేదని, పార్లమెంటు వేదికగా తమ గొంతులు వినిపించడానికి పోటీ చేస్తున్నట్టు తెలిపారు. 8 ఏళ్లుగా పోరాటం చేస్తే, తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారులకు ప్రమోషన్లు వస్తున్నాయని, సర్వస్వం కోల్పోయిన తమకు మాత్రం న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము పెట్టిన కేసు ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదని, గతంలో అన్ని పార్టీలు హామీ ఇచ్చిన కనీసం ఇప్పటివరకు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలని జనంలోకి వెళ్లి జనాన్నె అడుగుతామని, అందుకే పార్లమెంటు ఎన్నికల్లో బరిలో ఉంటున్నామని స్పష్టం చేశారు.


Next Story