మండుతున్న ఎండలు.. వడదెబ్బకు ముగ్గురు మృతి

by Disha Web Desk 7 |
మండుతున్న ఎండలు.. వడదెబ్బకు ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిబ్రవరి నెలకరు నుంచే ఎండలు అత్యధికంగా నమోదవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ప్రజలు విలవిల్లాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అయితే.. నేటి నుంచి 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో 40-43 డిగ్రీలు, GHMC లో మాత్రం 40 డిగ్రీల కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అంతే కాకుండా వడదెబ్బకు ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లొద్దని, జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story

Most Viewed