అసెంబ్లీలో కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!

by Disha Web Desk 4 |
అసెంబ్లీలో కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై శనివారం చర్చ సాగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్యలు, ఆకలి కేకలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. నల్గొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు ఉండేవన్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ కు రాజకీయ అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. కేసీఆర్‌ను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు.

ఎంపీగా, కేంద్ర మంత్రిగా కేసీఆర్‌కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్నారు. మేనేజ్‌మెంట్ కోటాలో కేటీఆర్ అసెంబ్లీకి వచ్చారన్నారు. తన రిప్లై గురించి బీఆర్ఎస్ తహతహలాడుతోందన్నారు. ఐదేళ్ల సమయం తమకుందని బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో లెక్కలతో సహా చెబుతామన్నారు. కొంత మంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామిక స్ఫూర్తి అర్థం అవగాహన కాదని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావుకు మంత్రి పదవి ఇచ్చిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Next Story

Most Viewed