రెండో జాబితా విడుదల వేళ గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి కీలక సమావేశం

by Dishafeatures2 |
రెండో జాబితా విడుదల వేళ గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డి కీలక సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీ కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తూనే.. మరోవైపు ప్రచారంలో కూడా దూకుడు పెంచుతోంది. ఇటీవల తొలి విడత బస్సు యాత్ర చేపట్టగా.. రెండో విడత బస్సు యాత్రపై చర్చలు జరుపుతోంది. అందులో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్‌లో టీ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. ఈ బేటీలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే పాల్గొననుున్నారు.

శనివారం నుంచి చేపట్టనున్న రెండో విడత బస్సు యాత్రపై చర్చించనున్నారు. ఈ యాత్రలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పాల్గొనేలా కార్యాచరణ సిద్దం చేస్తోన్నారు. వికారాబాద్ నుంచి చేవెళ్ల వరకు జరగనున్న ప్రచారంలో శివకుమార్ పాల్గొననున్నారు. అలాగే కర్ణాటక మంత్రి బోస్ రాజు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం టీ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల కానుంది. ఈ క్రమంలో టీ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం కీలకంగా మారనుంది.

Next Story

Most Viewed