ఆందోళనలో ప్రధాని మోడీ, అమిత్ షా: డిప్యూటీ CM భట్టి సెటైర్

by Satheesh |
ఆందోళనలో ప్రధాని మోడీ, అమిత్ షా: డిప్యూటీ CM భట్టి సెటైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రైతుల కష్టానికి తగిన ఫలితం రాబోయే రోజుల్లో దక్కనుందన్నారు. ఆదివారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మొగ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భట్టి విక్రమార్క సమావేశంలో ప్రసంగించారు. దేశంలో వరి, పత్తి, చెరకు రైతులకు మద్దతు ధర లభించడం లేదన్నారు. నరేంద్ర మోడీ నల్ల చట్టాలు తెచ్చి వారి ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలోని నిరుద్యోగులకు అప్రెంటిషిప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు. పట్టభద్రులు, డిప్లమా చేసిన వారందరికీ ఈ హక్కు ఇవ్వబోతున్నామన్నారు. పబ్లిక్ ,ప్రైవేటు సెక్టార్లలో సుమారు 30 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు.

ఆగస్టు 15 లోపు ఈ ఉద్యోగాలను ఇండియా కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలో ఆసుపత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఏడాది కాలంలోనే పక్కగా తొలి ఉద్యోగం లభిస్తుందన్నారు. ఉచిత శిక్షణ అందుతుందన్నారు. కోట్లాది మంది నిరుద్యోగులకు ఏడాదికి లక్ష రూపాయల నగదును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. నెలకు రూ.8500 అందజేస్తామన్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలకు లభిస్తున్న రోజువారి కూలీలు రూ.250 నుంచి రూ. 400కు పెంచుతామన్నారు. ఆశ, అంగన్వాడి మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని వివరించారు. గత పది సంవత్సరాల కాలంలో మోడీ 25 మందికి సంబంధించిన రూ.16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారన్నారు.

24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు సరిపడా డబ్బులను బీజేపీ ప్రభుత్వం 25 మందిని కుబేరుని చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది మంది దేశ ప్రజల్ని లక్షాధికారులని చేస్తుందని భరోసా ఇచ్చారు. మోడీ, అమిత్ షా ఆందోళనలో ఉన్నారన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయమని మోడీ అడగడం లేదన్నారు. మటన్, మందిర్, మంగళసూత్రం, మైనార్టీతో లాంటి అంశాలనే ప్రధాని మాట్లాడుతున్నారన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల్లో ఎస్సీ, ఎస్టీలు ఎందరో చెప్పడం లేదన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రిజర్వేషన్ ప్రకారం పోస్టులు ఇస్తామన్నారు. మహిళలకు 50 శాతం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తాం అన్నారు.

Next Story

Most Viewed