అతి త్వరలో శంషాబాద్ కు ఫ్లైఓవర్ మంజూరు : ఎంపీ రంజిత్ రెడ్డి

by Disha Web Desk 20 |
అతి త్వరలో శంషాబాద్ కు ఫ్లైఓవర్ మంజూరు : ఎంపీ రంజిత్ రెడ్డి
X

దిశ, శంషాబాద్ : శంషాబాద్ లో ఫ్లై ఓవర్ పొడిగించాలని కోరుతూ వారం రోజులపాటు నిరాహార దీక్ష చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు ఫ్లై ఓవర్ నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి దానిలో భాగంగా సోమవారం శంషాబాద్ ఫ్లై ఓవర్ పొడిగించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దానికి సంబంధించిన వివరాలను ఢిల్లీలోని నేషనల్ హైవే అధికారులకు పోన్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శంషాబాద్ లో ఫ్లై ఓవర్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం అధికారులు కూడా సానుకూలంగా స్పందించారని అతి త్వరలో శంషాబాద్ లో ఫ్లై ఓవర్ విస్తరణకు మంజూరు అయ్యే అవకాశం ఉందని అన్నారు.

ఫ్లై ఓవర్ నిర్మించడంతో సిద్ధాంతికి చెందిన ప్రజలు ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ రంజిత్ రెడ్డి లేఖ రాయడంతో శంషాబాద్ మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్ మేకల వెంకటేష్ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది ఎవరైనా చనిపోయిన స్మశాన వాటికకు, పిల్లలు స్కూళ్లకు, కూరగాయల మార్కెట్ కు, ఆస్పత్రి, మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాలన్న హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి దాటాల్సిందే అన్నారు. రోడ్డు దాటాలంటే ఎంతో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పి 15 రోజులు కాకముందే ఫ్లైఓవర్ నిర్మాణానికి లేఖ రాసినందుకు ధన్యవాదాలు తెలిపారు.



Next Story

Most Viewed