అదానీ అంబానీలను పెంచి పోషిస్తున్న మోదీ : చామల డింపుల్

by Disha Web Desk 23 |
అదానీ అంబానీలను పెంచి పోషిస్తున్న మోదీ : చామల డింపుల్
X

దిశ,ఇబ్రహీంపట్నం : భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సతీమణి డింపుల్ ప్రచారంలో పాల్గొన్నారు. గడపగడపకు ప్రచారం పేరిట సోమవారం రోజున ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని ఉదయం 11, 12 వార్డులలో, సాయంత్రం ఖానాపూర్ గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పథకాలను గడపగడపకు తీసుకెళ్లడం జరుగుతుందని, 6 గ్యారెంటీలలో మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 ఏం పి స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 15 స్థానాలు గెలుస్తుందని దేశంలో మోడీ మత విద్వేషాలు రెచ్చగొట్టి అంబానీ, ఆదానిలను పెంచి పోషిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, కౌన్సిలర్లు బర్ల మంగ జగదీష్, మమత నందు, పంది శంకరయ్య, శ్యామ్ లాల్, రాజు, మహేష్, నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story