గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్టు రిమాండ్​

by Disha Web Desk 11 |
గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులు అరెస్టు రిమాండ్​
X

దిశ, పరిగి : గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పరిగి డీఎస్పీ కరుణా సాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పరిగి కి చెందిన సయ్యద్ ఉజాయిఫ్​, సయ్యద్​ మల్కాపూర్​ గ్రామానికి చెందిన వడ్ల సాయిరాం చారి, సొండేపూర్​ గ్రామాని చెందిన పాల్త్యా సతీష్​, పెద్ద మాదారం గ్రామానికి చెందిన కొతిలి ప్రశాంత్​ సోమవారం సాయంత్రం పరిగి కోడంగల్​ చౌరస్తా వద్ద కారులో గంజాయి తరలిస్తున్న పోలీసులు సమాచారం తెలుసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద 207 గ్రాముల గంజాయిని తరలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీఎస్పీ కరుణా సాగర్​ రెడ్డి తెలిపారు. సీఐ శ్రీనివాస్​,ఎస్​ఐ సంతోష్​ కుమార్​ లు ఉన్నారు.


Next Story

Most Viewed