ఆ ఫైలుపైనే తొలి సంతకం: నారా లోకేశ్

by Disha Web Desk 16 |
Nara Lokesh
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వస్తే డీఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా పింఛన్‌ను ఇళ్ల వద్దకే తెచ్చిస్తానని చెప్పారు.ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాగానే పింఛన్ రూ. 4 వేలు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. ఐదేళ్లలో ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జగన్ ప్రకటించింది మేనిఫెస్టో కాదని, రాజీనామా లేఖ అని ఎద్దేవా చేశారు. రూ. 500 పింఛన్ పెంచుతామనడం జగన్ దివాలాకోరుతనమని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం చేసినట్లు తెలుస్తోందని నారా లోకేశ్ విమర్శించారు.



Next Story

Most Viewed