కారు ఢీకొని బాలుడు మృతి

by Disha Web Desk 23 |
కారు ఢీకొని బాలుడు మృతి
X

దిశ,మేడిపల్లి: ఓ అపార్ట్మెంట్ లో కారు ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన రాచకొండ పోలీస్ పరిధి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మేడిపల్లి ఎస్ ఐ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ కు చెందిన జయంత్, తన భార్య దివ్య, కుమారుడు శివతో కలిసి పీర్జాదిగూడ 2 వ డివిజన్ పంచవటి కాలనిలో ప్రియా ఎంక్లేవ్ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేస్తూ నివసిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తల్లి అప్పుడే బాబుకు అన్నం తినిపించి లోపలికి వెళ్లగా అపార్ట్మెంట్ లో నివాసం ఉండే విష్ణు తేజ(27), అనే వ్యక్తి తన కారుతో ఒక్కసారిగా అపార్ట్మెంట్ లోకి రాగ అక్కడే ఉన్నా చిన్నారి శివని కారు ఢీ కొట్టడం తో శివ అక్కడికక్కడే మృతి చెందాడు, స్పీడ్ గా రావడంతోనే తన కుమారుని మృతికి కారణమయ్యారని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని నిందితునిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ అనిల్ కుమార్ తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed