రైతుల అభివృద్ధే ధ్యేయం: ఎంపీ రంజిత్​ రెడ్డి

by Disha Web Desk 11 |
రైతుల అభివృద్ధే ధ్యేయం: ఎంపీ రంజిత్​ రెడ్డి
X

దిశ, పరిగి: రైతుల అభివృద్ధే ధ్యేయమని ఎంపీ రంజిత్​ రెడ్డి అన్నారు. పరిగి మండలం రాఘవాపూర్​ గ్రామంలో రూ. 98 లక్షలతో నిర్మించిన గోదాంను గురువారం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డితో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గడ్డం రంజిత్​ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఉపయోగకరంగా ఉండేలా గోదాం నిర్మించారన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ఈ గోదాముల్లో నిల్వచుంకునే అవకాశం ఉంటుందన్నారు. 1000 మెట్రిక్​ టన్నుల సామర్థ్యం గల గోదాము రాఘవాపూర్​ గ్రామంలో నిర్మించుకోవడం నిజంగా మీ అధృష్టమన్నారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి మాట్లాడుతూ రైతుల అభివృద్దే ధ్యేయంగా వ్యవసాయ రంగంలో ఎన్నోమార్పులు తీసుకువచ్చారన్నారు.

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తూ వారు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారన్నారు. డీసీసీబీ చైర్మన్​ బుయ్యని మనోహర్​ రెడ్డి మాట్లాడుతూ ఈ గోదాము నిర్మించేందుకు రూ.20 లక్షలు సహకార బ్యాంకు, మిగతా 78 లక్షలు డీసీసీబీ బ్యాంకు ద్వారా రుణం అందించి కట్టించామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్​ చైర్మన్​ కొప్పుల శ్యాంసుందర్​ రెడ్డి, ఎంపీపీ కరణం అరవింద్​ రావ్​, జెడ్పీటీసీ బేతు హరిప్రియ, ఏఎంసీ చైర్మన్​ అంతిగారి సురేందర్​ కుమార్​, వైస్​ చైర్మన్​ శివన్నోళ్ల భాస్కర్​, డీజీఎం సత్య ప్రసాద్, బ్యాంకు మేనేజర్ నర్సింహులు,​ కె.బాలకృష్ణ, గ్రామ సర్పంచ్​ నల్క జగన్​, పీఏసీఎస్​ డైరెక్టర్లు పి.హన్మంత్​ రెడ్డి, బోజ్యా నాయక్​, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు వెంకట్​ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed