యూనివర్సిటీలో విద్యార్థుల ముందస్తు అరెస్టు

by Disha Web Desk 15 |
యూనివర్సిటీలో విద్యార్థుల ముందస్తు అరెస్టు
X

దిశ, రాజేంద్రనగర్ : రాష్ట్ర హైకోర్టుకు ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. హైకోర్టు నిర్మాణానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 100 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా విద్యార్థులు హైకోర్టుకు భూములు ఇవ్వొద్దని తీవ్రస్థాయిలో ఆందోళన చేశారు.

ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తారనే ఉద్దేశంతో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన మహేష్, జీవన్, కమల్, సూర్య, ప్రకాష్, రాజు కుమార్ తదితరులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈరోజు సాయంత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్ర చూడ్ శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఘటన స్థలంలో భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.


Next Story

Most Viewed