పబ్లిక్‌గా తాగేస్తున్నారు..!

by Disha Web Desk 20 |
పబ్లిక్‌గా తాగేస్తున్నారు..!
X

దిశ, తాండూరు రూరల్ : మందుబాబుల హడావుడి అంతకంతకూ పెరిగిపోతోంది. మద్యం దుకాణాల్లో పర్మిట్‌ రూములు లేకపోవడం, బార్లలో ఖరీదు ఎక్కువగా ఉండడంతో మందుబాబులు రోడ్డెక్కారు. తాగడానికి ఎక్కడ జాగా దొరికితే అక్కడ సిట్టింగులు వేసి సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సాయంత్రం ఆరు దాటిందంటే ఖాళీ జాగా కనపడిన చోటల్లా మందుబాబులు తిష్ట వేస్తున్నారు. మందుబాబులు ఎక్కడంటే అక్కడ సిట్టింగులు వేస్తున్నారు. రాత్రి పూట కొద్దిగా చాటు దొరికే ప్రాంతాలలో వీళ్లు పాగా వేస్తున్నారు. రాత్రి వేళలో ప్రభుత్వ ప్రాంగణంలో ఎవ్వరు కూడ లేక పోవడంతో ఇదే అదునుగా భావించిన మందు బాబులు అడ్డాగా మార్చుకుని మందు విందు ! చేసుకున్నట్లు కనిపించడం గమనర్హం.

ప్రధాన ద్వారం సమీపంలో సబ్ రిజిస్టర్, గనులు భూగర్భ శాఖల కార్యాలయాల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలపాలకం వద్ద తాగిన ఖాళీ బీర్ సీసాలు ఓ కాటన్ డబ్బాలో పడవేశారు. ఇక్కడ పశువైద్య శాల, వ్యవసాయ శాఖ, విద్యావనరుల కేంద్రం, మండల పరిషత్, శ్రీ శక్తి భవన్ ఉపాధి హామీ, ఐకేపి, తహసీల్దార్, కార్యాలయంతో పాటు ఖజానా శాఖ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఖాళీ స్థలాల్లో చెట్లకింద మధ్యం బీర్ సీసాలు పడివున్నాయి. కానీ అధికారులు ఎవ్వరు కూడ అటుగా పరిశీలించకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే ముందుముందు మరింత మంది మందు బాబులు అడ్డగా మార్చుకునే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Next Story

Most Viewed