ఒకే వేదికపై ముగ్గురు ప్రముఖులు.. ఆ షోకి ఎప్పుడొస్తారంటూ నెటిజన్ల కామెంట్స్!

by Disha Web Desk 19 |
ఒకే వేదికపై ముగ్గురు ప్రముఖులు.. ఆ షోకి ఎప్పుడొస్తారంటూ నెటిజన్ల కామెంట్స్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్‌తో తెలుగు సినీ హీరోలకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వివిధ కార్యక్రమాల సందర్భంగా ఆయన్ను కలిసేందుకు హీరోలు ఉత్సాహం చూపిస్తుంటారు. తాజాగా ఒకే వేదికపై మూడు విభిన్న రంగాలకు చెందిన ప్రముఖుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతున్నాయి. తాజాగా మహీంద్రా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కర్మాగారం కోసం మంత్రి కేటీఆర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం అనంతరం మహీంద్రా సంస్థ తయారు చేసిన XUV-400 ఫార్ములా ఎడిషన్ జనరేషన్-3 రేసింగ్ కారుని ఆవిష్కరించారు. ఈ కారు ఆవిష్కరణ కోసం మూడు విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. హీరో రామ్‌చరణ్, మంత్రి కేటీఆర్, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా. ఈ నేపథ్యంలో కేటీఆర్, రామ్‌చరణ్, ఆనంద్ మహీంద్రా ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

పలు అంశాల గురించి చర్చించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహీంద్రా రేసింగ్ కార్ ప్రారంభోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా, సీపీ గుర్నాని, రామ్‌‌చరణ్‌ని కలవడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన సందర్భంగా రామ్‌చరణ్‌కి శుభాకాంక్షలు తెలిపినట్టు చెప్పారు. ఆస్కార్‌కి నామినేట్ అయిన ఆర్ఆర్ఆర్‌కి ఆ అవార్డ్ ఖచ్చితంగా రావాలని ఆకాంక్షించారు. అయితే, వీరి ఫోటోలను చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపపిస్తున్నారు.

ఇటీవల రాంచరణ్, మంత్రి కేటీఆర్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లుకొట్టిన సంగతి తెలిసిందే. సినీ నటుడు బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్-2 షోలో మంత్రి కేటీఆర్, రాంచరణ్ పాల్గొంటున్నారని.. త్వరలో ఎపిసోడ్ షూటింగ్ కానుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.. షో గురించి ఇప్పటివరకు దాని గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో 'అన్ స్టాపబుల్ షోకి ఎప్పుడు వస్తారు సార్.. వీ ఆర్ వెయిటింగ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైన ఒకే వేదికపై కేటీఆర్, రాంచరణ్, మహీంద్రా కలిసిన ఫోటోలు మాత్రం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

Next Story