ఉత్తర‌ప్రదేశ్‌లో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. భారీ ఎత్తున మెడిసిన్స్ స్వాధీనం

by Disha Web Desk 1 |
ఉత్తర‌ప్రదేశ్‌లో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు.. భారీ ఎత్తున మెడిసిన్స్ స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: ఎలాంటి అనుమతులు లేకుండా మెడిసిన్స్ తయారు చేసి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (టీడీసీఏ) అధికారులు అదుపులోకి తసుకున్నారు. గతనెల 27న మలక్‌పేట‌లోని పలు డ్రగ్స్ కంపెనీలపై అధికారులు దాడులు నిర్వహించారు. అయితే, అక్కడ లభించిన ఆధారాల మేరకు తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు ఉత్తర ప్రదేశ్‌లోని కోట్ద్వారలో తనిఖీలో చేపట్టారు. అయితే ‘ఆపరేషన్ జై’ పేరుతో అధికారులు అక్రమంగా నడుపుతున్న మెడిసిన్స్ తయారీ కేంద్రాలపై టీడీసీఏ అధికారులు ఏక కాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా పలు రకాల మందులు, మిషనరీని వారు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు ఇక్కడి నుంచే మందులు సరఫరా అవుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ మేరకు యూపీకి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.

Next Story

Most Viewed