రాహుల్ బైక్ ర్యాలీలో అపశృతి.. కొండా సురేఖకు యాక్సిడెంట్

by Disha Web Desk 4 |
రాహుల్ బైక్ ర్యాలీలో అపశృతి.. కొండా సురేఖకు యాక్సిడెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ బైక్ ర్యాలీలో కొండా సురేఖ ప్రమాదానికి గురయ్యారు. స్వయంగా స్కూటీ నడిపిన కొండా సురేఖ.. పార్టీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొంది. బైకు నడుపుతున్న క్రమంలో అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో కుడి కన్ను పై భాగం, చేతికి గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త కొండా మురళీ హుటాహటిన ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె తగిలిన గాయాలు చూసి కంటతడి పెట్టుకున్నారు.


Next Story