Droupadi Murmu : ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

by Sathputhe Rajesh |   (  Updated:2023-12-23 06:34:40  IST  )

తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము ప‌ర్యట‌న ముగిసింది.

Droupadi Murmu : ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము ప‌ర్యట‌న ముగిసింది. శీతాకాల విడిది నేపథ్యంలో ఈ నెల 18న రాష్ట్రానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రప‌తి, ప‌లు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భూదాన్ పోచంప‌ల్లిని కూడా సంద‌ర్శించారు. నిన్న రాత్రి బొల్లారంలోని రాష్ట్రప‌తి నిల‌యంలో ‘ఎట్‌హోమ్’ కార్యక్రమం నిర్వహించారు. ఇవాళ ఉద‌యం హ‌కీంపేట్‌లో రాష్ట్రపతికి గ‌వ‌ర్నర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అధికారులు వీడ్కోలు ప‌లికారు. అనంత‌రం ప్రత్యేక విమానంలో ఆమె ఢిల్లీకి పయనమయ్యారు.

Next Story