- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
President Draupadi Murmu : 16న తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. 17న ఏపీ పర్యటన
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఈనెల 16వ తేదీన తెలంగాణ(Telangana)కు చేరుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఈనెల 16వ తేదీన తెలంగాణ(Telangana)కు చేరుకుంటారు. శీతకాల విడిది కోసం ముర్ము 21వ తేదీ వరకు హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి భవన్ లో బస చేస్తారు. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 17న ఆంధ్రప్రదేశ్(AP)లో పర్యటించనున్నారు. గుంటూరులోని మంగళగిరి(Mangalagiri) ఎయిమ్స్ వైద్యకళాశాల (AIIMS) స్నాతకోత్సవానికి ముర్ము హాజరుకానున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎయిమ్స్లో సంబంధిత వైద్యాధికారులతో పాటు నగరపాలక, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. రాష్ట్రపతి పాల్గొనే సదస్సు ప్రధాన ఆడిటోరియాన్ని పరిశీలించి కార్యక్రమంలో పాల్గొనే వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రపతి మంగళగిరికి చేరుకుని ఎయిమ్స్లోకి వచ్చే మార్గం, తిరిగి వెళ్లే మార్గంలో అధికారికంగా చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లను సంబంధిత అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు. వీఐపీలు, అధికారులు, ప్రముఖుల వాహన పార్కింగ్ ఏర్పాట్లపై సూచనలు చేశారు.






