ఓరుగల్లులో బీఆర్ఎస్ vs కాంగ్రెస్ మధ్య ఛాలెంజింగ్ పర్వం

by Muthe.Rajitha |

వరంగల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

ఓరుగల్లులో బీఆర్ఎస్ vs కాంగ్రెస్ మధ్య ఛాలెంజింగ్ పర్వం
X

దిశ, వెబ్ డెస్క్ : వరంగల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఓరుగల్లు నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఛాలెంజ్ ల పర్వం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రస్తుత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి దమ్ముంటే గన్ మెన్లు లేకుండా బస్ స్టాండ్‌కు వెళ్లాలని సవాల్ విసిరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గన్ మెన్లు, అనుచరులు లేకుండానే బస్ స్టాండ్‌కు వెళ్లి సవాలును స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని "పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బజార్లో ఉరికించి కొడతాము" అని హెచ్చరించారు. ఓవైపు వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య పోరుతో పాటు, ఇటు ప్రతిపక్ష నేతల సవాళ్లతో ఓరుగల్లు రాజకీయాలు మరింత హీటెక్కాయి.

Next Story