కరీంనగర్‌లో ఏసీబీ పంజా.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కార్యదర్శి

by Disha Web Desk 2 |
కరీంనగర్‌లో ఏసీబీ పంజా.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన కార్యదర్శి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్‌లో ఏసీబీ అధికారులు మరోసారి కొరడా ఝులిపించారు. నగరంలోని ఆర్టీసీ వర్క్ షాప్ సమీపంలో శనివారం లంచం తీసుకుంటుండగా ఓ పంచాయతీ కార్యదర్శిని పట్టుకున్నారు. రూ. 90 వేలు తీసుకుంటున్న సెక్రటరీ శ్రీధర్‌ను రెడ్ హైండెడ్‌గా పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ కే.భద్రయ్య, సీఐ ఎస్పీ రవిందర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

రిటైర్డ్ సైనికునికిని వద్దే లంచం

రిటైర్డ్ సైనికుడు బావుపేట శివారల్లో రేకుల ఫ్యాక్టరీ నిర్మించుకునేందుకు నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా సెక్రటరీ ఊట్కూరి శ్రీధర్ రూ.లక్ష డిమాండ్ చేశారు. తిరుపతి అనే వ్యక్తి నుండి రూ.90 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.


Next Story

Most Viewed