సౌదీ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఓవైసీ

by Ajay Maddhiboyina |

సౌదీలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మక్కా యాత్రకు వెళ్లిన యాత్రికులు అక్కడ నుండి మదీనాకు వెళుతుండగా డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 42మంది సజీవదహనం అయ్యారు.

సౌదీ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఓవైసీ
X

దిశ, వెబ్ డెస్క్: సౌదీలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. మక్కా యాత్రకు వెళ్లిన యాత్రికులు అక్కడ నుండి మదీనాకు వెళుతుండగా డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 42మంది సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఎక్కువ‌మంది హైద‌రాబాదీలే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘ‌ట‌న‌పై ఎంఐఎం అధినేత‌, ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ దిగ్బ్రాంతి వ్య‌క్తం చేశారు. అధికారుల నుండి స‌మాచారం సేక‌రిస్తున్నామ‌ని తెలిపారు. మ‌రోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్ర‌మాద ఘ‌ట‌న‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. హెల్ప్ లైన్ కోసం కోసం స‌చివాల‌యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఇక ఇదే ఘ‌ట‌న‌పై సీపీ స‌జ్జ‌నార్ స్పందించారు.

Next Story