సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఒవైసీ బ్రదర్స్.. కీలక అభ్యర్థన

by Kema Shiva Kumar |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఇవాళ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఒవైసీ బ్రదర్స్.. కీలక అభ్యర్థన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని ఇవాళ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మర్కజీ మిలాద్ జులూస్ కమిటీ సభ్యులు సీఎంకు వినతిపత్రం అందజేశారు. మలాద్-ఉన్-నబీ సందర్భంగా నగర పరిధిలో ఉన్న పురాతన మసీదులతో పాటు దర్గాలను అలంకరించాలని, అందుకు కావాల్సిన విద్యుత్‌ను ఉచితంగా అందజేయాలని సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 14‌న రాష్ట్ర వ్యాప్తంగా ఉలాద్-ఉన్-నబీ జూలూస్‌కు అనుమతి ఇవ్వాలని కమిటీ సభ్యులు వినతిపత్రంలో కోరారు.

Next Story