ఒకప్పుడు ఎల్లగొట్టిన్రు, ఇప్పుడు దూరం అవుతున్రు.. విజయశాంతి ట్వీట్

by Disha Web Desk 5 |
ఒకప్పుడు ఎల్లగొట్టిన్రు, ఇప్పుడు దూరం అవుతున్రు.. విజయశాంతి ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీగా ఉన్న కే కేశవరావు పార్టీ మారడం పట్ల కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. బీఆర్ఎస్‌కు నేతలు దూరమవుతుండం పట్ల కేసీఆర్ విశ్లేషించుకోవాలని ట్విట్ చేశారు. నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ మొదటి సెక్రటరీ జనరల్ విజయశాంతిని అధ్యక్షులు కేసీఆర్ గారు కారణం చూపకుండా, కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇయ్యక, పార్టీ నుండి సస్పెండ్ చేసి ఒకప్పుడు ఎల్లగొట్టిన్రు అని, ఇయ్యాల్టి బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు గారు ఆత్మగౌరవ రీత్యా ఆ పార్టీకి దూరం కానున్నట్లు వార్తలు ఎల్తున్నయి అని, తప్పులేడ తప్పులేడ జరిగినయో, అందరెందుకు దూరమైతున్నరో, కేసీఆర్ గారు తన ప్రభావం తానే ఏ కారణాలతో రోజు రోజుకి కోల్పోతున్నరో వారే విశ్లేషించుకోవటం అవసరం అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మీ కడుపు కోత అర్థం అవుతుంది రాములమ్మా అని, కేసీఆర్ నిజమైన తెలంగాణ బిడ్డలను మోసం చేసినందుకు కర్మఫలితం అనుభవిస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు.


Next Story

Most Viewed