మాజీ జెడ్పి చైర్మన్ కారు అద్దాలు ధ్వంసం చేసిన ఇద్దరి అరెస్ట్...

by Disha Web Desk 9 |
మాజీ జెడ్పి చైర్మన్ కారు అద్దాలు ధ్వంసం చేసిన ఇద్దరి అరెస్ట్...
X

దిశ నిజాంసాగర్: నిజాంసాగర్ మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన మాజీ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ దాఫెదర్ రాజు కారు అద్దాలను ధ్వంసం చేసిన కేసులో ఇద్దరినీ అరెస్టు చేసినట్లు నిజాంసాగర్ ఎస్ఐ రాజు తెలిపారు. ఈనెల 13న రాత్రి అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆకాష్, దేవాడ రాజశేఖర్ లు మాజీ ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ అద్దాలు ధ్వంసం చేశారని ఎస్సై తెలిపారు. వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు స్థానిక ఎస్సై రాజు తెలిపారు.



Next Story

Most Viewed