- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
క్రమశిక్షణతో కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అప్పుడే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు.

దిశ, దోమకొండ : క్రమశిక్షణతో కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అప్పుడే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ వసతి గృహాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిలతో మాట్లాడారు. ఒక్కొక్కరి అభిప్రాయాలు తెలుసుకొని, అందుకు అనుగుణంగా సలహాలు సూచనలు ఇచ్చారు. కష్టపడి చదువుకొని అటు తల్లిదండ్రులకు, ఇటు జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు సక్రమంగా అందుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం విషయంలో ఫోకస్ చేయాలని పాఠశాల ప్రిన్సిపాల్ చైతన్య సుధను ఆదేశించారు. సీసీ రోడ్డు లేకపోవడం, వీధిదీపాలు లేకపోవడం వలన విద్యార్థినులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత జిల్లా సూపరింటెండెంట్, ఇంజనీర్, ట్రాన్స్ కో అధికారులతో మాట్లాడి విద్యుత్ శాఖ సహకారంతో వైర్ గుంజి వీధిదీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీపీ నిధులతో పాటు, కలెక్టర్ నిధులతో పనులు త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని సర్పంచ్ నర్సయ్యకు సూచించారు. పడిపోయిన ప్రహరీ గోడకు మరమ్మతులు చేయించాలని, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారితో మాట్లాడి, ప్రహరీ గోడను తిరిగి పునర్నిర్మించాలని ఆదేశించారు. ఆయన వెంట మాజీ జడ్పిటిసి సభ్యులు తీగల తిరుమల గౌడ్, జిల్లా కోఆర్డినేటర్ శివరాములు, ప్రత్యేక అధికారిని జ్యోతి, తహసీల్దార్ సుధాకర్, ఎంఈఓ విజయ్ కుమార్, ఎంపీఓ రవికుమార్, తదితరులు ఉన్నారు.






