ప్రతీ గ్రామానికి ఒక పోలీసు అధికారి ఉండేలా చర్యలు తీసుకోవాలి

by Naveena |

ప్రతీ గ్రామానికి ఒక పోలీసు అధికారి ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర అన్నారు

ప్రతీ గ్రామానికి ఒక పోలీసు అధికారి ఉండేలా చర్యలు తీసుకోవాలి
X

దిశ, కామారెడ్డి టౌన్ : ప్రతీ గ్రామానికి ఒక పోలీసు అధికారి ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రతీ పోలీసు స్టేషన్ అధికారితో (యస్ ఐ) ఎస్ హెచ్ ఓలతో మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి, ప్రతి గ్రామానికి సంబంధించిన సమాచారం వెంటనే తెలుసుకోవాలని, ప్రతీ గ్రామానికి ఒక పోలీసు అధికారి ఉండేలా చూడాలన్నారు. రౌడీ, అనుమానిత హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచి, వారిని తరచూగా చెక్ చేస్తూ ఉండాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాంక్, ఎటియం, పెట్రోల్ బంక్, ప్రార్థన స్థలాల యందు సి.సి కెమెరాల ఏర్పాటు చేసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై అన్ని స్థాయిల అధికారులు దృష్టి సారించాలని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు.

కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని పరిశీలించి ఫైనల్ చేయాలని, ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో సాంకేతిక పరజ్ఞానం ఉపయోగించి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో నిర్ణీత సమయంలో చార్జిషీట్ దాఖలు చేయాలని అన్నారు. అన్ని రకాల ఫిర్యాదులపై చట్టప్రకారం స్పందించి ఎప్పటికప్పుడు సందేశం మొబైల్ ద్వారా అందజేయలి అని సూచించారు. గ్రామాలలో సిసిటీవిల ప్రాముఖ్యత పై అవగాహన కల్పిస్తూ .. బ్యాంక్, ఎటియం, పెట్రోల్ బంక్, ప్రార్థన స్తలాల యందు సిసిటీవి ల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పి చైతన్య రెడ్డి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కే నరసింహారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, సత్యనారాయణ, స్పెషల్ బ్యాచ్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, డిసిఆర్ బి ఇన్స్పెక్టర్ మురళి, సీఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
Next Story