అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి.. అశోక్ కుమార్

by Disha Web Desk 20 |
అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి.. అశోక్ కుమార్
X

దిశ, కామారెడ్డి రూరల్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి అశోక్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాదు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉపాధిహామీ పథకం కింద అర్హులైన శ్రామిక కుటుంబాలకు పనికల్పిస్తూ ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.

అర్హులైన వారిని గుర్తించి జాబ్ కార్డులు ఇస్తున్నామని చెప్పారు. జిల్లాలలో చేపట్టిన ఉపాధిహామీ పనులలో పనిచేస్తున్న కూలీలకు సకాలంలో చెల్లింపులు చేస్తున్నామన్నారు. ఉపాధిహామీ పథకం కింద మంజూరైన పనులకు అనుమతులు పొందిన అనంతరం కూలీలకు పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో ఎంపిక చేయబడిన పనులకు పాలనపరమైన అనుమతులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కొనసాగుతున్న పనుల పురోగతిపై ఫోటోలను అప్లోడ్ చేయాలని, అర్హులైన కూలీలకు మాత్రమే పనులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఉపాధిహామీ పథకం కింద విస్తృతంగా మొక్కల పెంపకం దిశగా దృష్టి సారించాలని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మనఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. పనులు వేగవంతం చేసేదిశగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయన్న, అదనపు డీఆర్ డీఓ మురళీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిల్లోనే జరగాలి..

ప్రసవాలు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగే విధంగా ఆరోగ్య, ఆశాకార్యకర్తలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం వైద్యులు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలతో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంపుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాలు చేయించుకునే మహిళలకు కలిగే ప్రయోజనాలను వివరించాలని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవాలు చేయించుకుంటే గర్భిణీ కుటుంబీకులపై ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. గత ఏడాది ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రసవాలు చేయించుకున్న 12 మంది గర్భిణీలు మృతి చెందారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ట్ విజయలక్ష్మి, వైద్యులు, అధికారులు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story