ఆశ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

by Disha Web Desk 1 |
ఆశ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
X

ఏడు గంటలు శ్రమించి పేగుపై క్యాన్సర్ కణతుల తొలగింపు

దిశ ఆర్మూర్ : మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లోని ఆశా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యులు బాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం అరుదైన శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన హీరా భాయ్ అనే మహిళ కొంతకాలంగా పేగు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. కొన్ని రోజుల నుంచి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటుండగా బుధవారం హీరాబాయికి సర్జరీని నిర్వహించి పేగుపై ఉన్న క్యాన్సర్ కారక భాగాన్ని ఆశ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రధాన వైద్య బృందం బాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి విజయవంతంగా తొలగించారు. దాదాపు ఏడు గంటల పాటు అప్రతిహతంగా శ్రమించి కష్ట తరమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా ఇరువురు వైద్యులను ఆర్మూర్ పట్టణంలోని ప్రముఖులు, పలువురు వైద్య నిపుణులు అభినందించారు.

Also Read..

Breaking: భూమా అఖిల‌ప్రియకు రిమాండ్, జైలుకు తరలింపు



Next Story