- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ అభ్యర్థులు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్షీ లను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం హైదరాబాద్లో జహీరాబాద్, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు జీవన్ రెడ్డి ,సురేష్ షెట్కర్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, వేంనరేందర్ రెడ్డి , ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితర ముఖ్య నాయకులు గెలుపే లక్ష్యంగా సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా వారు
మాట్లాడుతూ... నిజామాబాద్, జహీరాబాద్ అస్తిత్వానికి, అభివృద్ధికి ఆటంకంగా మారిన ధర్మపురి అరవింద్, బీబీ పాటిల్ ను గద్దె దించే సమయం ఆసన్నమైంది అన్నారు. లోక్ సభలో నిజామాబాద్, జహీరాబాద్ ప్రజల వాణి గట్టిగా వినిపించాలన్నా, అభివృద్ధి గట్టిగా జరగాలన్నా, పేద ప్రజల అభివృద్ధికై అనుక్షణం తపించే జీవన్ రెడ్డి , సురేష్ కుమార్ షెట్కార్ ను ఎంపీలుగా అఖండ మెజారిటీతో గెలిపించాలి అన్నారు. ఆరు గ్యారంటీలు, ఐదు న్యాయాలతో మీ ముందుకు వస్తున్న నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి , జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్ లను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు.