ఆపదలో ఉన్న పేదలకు అండగా మంత్రి వేముల

by Disha Web Desk 1 |
ఆపదలో ఉన్న పేదలకు అండగా మంత్రి వేముల
X

దిశ, భీమ్‌గల్ : బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ఏర్గట్ల మండల కేంద్రానికి చెందిన ఏ.లక్ష్మి అనే మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి సదరు మహిళను హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుప్రతిలో జాయిన్ చేయించి చికిత్స నిమిత్తం రూ.2.50 లక్షల ఎల్.వో.సీ మంజూరు చేయించారు. అందుకు సంబంధించిన కాపీని బుధవారం బాధిత మహిళ కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. సమస్యను తెలిపిన వెంటనే స్పందించి, చికిత్స చేయిస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామని బాధిత కుటుంబం తెలిపారు.

Next Story

Most Viewed