జీ.ఆర్. కాల‌నీ ని ప‌రిశీలించిన కేంద్ర బృందం

by Ratna Kumari |

దిశ‌, కామారెడ్డి టౌన్ : ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు కామారెడ్డిలోని జీ.ఆర్. కాల‌నీ జ‌ల‌మైన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర బృందం జీ.ఆర్. కాల‌నీని ప‌రిశీలించింది.

జీ.ఆర్. కాల‌నీ ని ప‌రిశీలించిన కేంద్ర బృందం
X

దిశ‌, కామారెడ్డి టౌన్ : ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు కామారెడ్డిలోని జీ.ఆర్. కాల‌నీ జ‌ల‌మైన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర బృందం జీ.ఆర్. కాల‌నీని ప‌రిశీలించింది. ముఖ్యంగా వినాయ‌క చ‌వితి పండుగ ప‌ర్వ‌దినం రోజు జీ.ఆర్. కాల‌నీ నీటిలో మున‌గ‌డం గ‌మ‌నార్హం. కాల‌నీ నీటిలో మునిగిన‌ప్ప‌టికీ ఎలాంటి ప్రాణ న‌ష్టం మాత్రం జ‌రుగ‌లేదు. దీంతో ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు. ఆ స‌మ‌స్య ఎలా వ‌చ్చింద‌ని కేంద్ర బృందం జీ.ఆర్. కాల‌నీని ప‌రిశీలించింది. ముందు ముందు ఇలాంటి స‌మ‌స్య‌లు పున‌రావృతం కాకుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కేంద్ర బృందం అధికారుల‌తో క‌లెక్ట‌ర్ చ‌ర్చించారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్, అధికారులు పాల్గొన్నారు.

Next Story