- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తాడ్వాయిలో ఓటర్లకు డబ్బులు పంచుతూ పట్టుబడ్డ బీఆర్ఎస్ నాయకుడు
దిశ, తాడ్వాయి: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఏస్ పార్టీ ప్రచారానికి ఓటర్లకు డబ్బులు పంచుతూ రెడ్ హ్యాంగ్గా నాయకుడు ఎఫ్ఎస్టి టీం సభ్యులకు పట్టుబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న గాలి అనిల్ కుమార్ గురువారం రాత్రి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల ఓటర్లను ప్రచారానికి తరలించే క్రమంలో ఎల్లమ్మ గుడి దగ్గర కన్కల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మైలారం సంతోష్ రెడ్డి ఓటర్లకు డబ్బులు పంచుతుండగా ఎఫ్ఎస్టి టీం సభ్యులకు చాకచక్యంగా పట్టుకున్నట్లు తెలిపారు. డబ్బులు పంచుతూ పట్టుబడ్డ మైలారం సంతోష్ రెడ్డి నుంచి రూ,10100 డబ్బులు బిఆర్ఎస్ పార్టీ కండువాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఎఫ్ఎస్టి టీం సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.