బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు..

by Disha Web Desk 20 |
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు కౌన్సిలర్లు..
X

దిశ, హుజూర్ నగర్ : హుజూర్ నగర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీలో గెలుపొందిన ఇద్దరు కౌన్సిలర్లు శనివారం హైదరాబాదులోని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో రెండవ వార్డు కౌన్సిలర్ జక్కుల సాంబయ్య నాలుగవ వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి ఉత్తమ్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో హుజుర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెల్లి రవి కౌన్సిలర్ అమరబోయిన సతీష్ మాజీ గ్రంథాలయ చైర్మన్ పిన్నెల్లి సంపత్ కుమార్, గంజి శివ పాల్గొన్నారు.

Next Story

Most Viewed