మరణించిన వారి ఓట్లు విచారించి తొలగించాలి

by Naveena |
మరణించిన వారి ఓట్లు విచారించి తొలగించాలి
X

దిశ, సూర్యాపేట; ఫారం-6,7,8 లపై ఏమైనా సందేహాలుంటే రాజకీయ పార్టీ ప్రతినిధులు పిర్యాదు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులతో అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ... బూత్ స్థాయి లో అన్ని పార్టీల ఏజెంట్ ల జాబితాను త్వరగా అందజేయాలనీ సూచించారు.జిల్లాలో 29 నవంబర్ 2024 నుండి నేటి వరకు కొత్త ఓటు కొరకు ఫారం-6 లు 4707 స్వీకరించగా 2927 అంగీకారం తెలపగా 958 తిరస్కరణ కి గురైనవి మిగిలిన 822 పెండింగ్ లో కలవని,ఓటు తొలిగించుటకు ఫారం-7 లు 2397 వచ్చాయని వాటిలో 1547 ఆమోదించగా, 275 తిరస్కరించామని మిగిలిన 575 పెండింగ్ లో ఉన్నాయని, మార్పులు చేర్పులు కొరకు ఫారం-8 లు 8439 వచ్చాయని వాటిలో 5689 ఆమోదం తెలపగా, 1233 తిరస్కరణ చేశామని మిగిలిన 1517 వివిధ దశలలో పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధులు ఫారం-6,7,8 లపై ఏమైనా సందేహాలు ఉంటే పిర్యాదు చేయవచ్చు అని తదుపరి బూత్ లెవెల్ లో విచారణ చేపిస్తామని తెలిపారు.

మరణించిన వారి ఓట్లు తొలిగించ్చేటప్పుడు గ్రామ పంచాయతీ రికార్డుల పరిశీలించాలని లేదా మరణ ధ్రువీకరణ పత్రం లేదా కుటుంబ సభ్యుల అంగీకారం తీసుకొని ఫారం -7 ద్వారా తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఎపిక్ కార్డులు జాగ్రత్తగా పరిశీలించి పోస్టల్ శాఖ ద్వారా లబ్ధిదారులకి పోస్ట్ చేయాలని,గ్రామ పంచాయతీ లలో, మున్సిపాల్టీ లలో ఒకే వ్యక్తికి డబుల్ ఓటు రాకుండా మరల ఒక్కసారి ఓటర్ జాబితా పరిశీలించాలని సూచించారు.పోలింగ్ స్టేషన్ లలో ఏమైనా మార్పులుంటే ఎలక్షన్ కమిషన్ కి తెలియపర్చాలని సూచించారు. ఈ సమావేశం లో కాంగ్రెస్ నుండి చకిలం రాజేశ్వరరావు, బి జే పి నుండి హబీబ్, బి ఆర్ ఎస్ నుండి సత్యనారాయణ,బి ఎస్ పి నుండి , సి పి ఐ (యమ్) నుండి, వై ఎస్ ఆర్ సి పి నుండి రమేష్, ఎలక్షన్ సూపరిటీడెంట్ శ్రీనివాసరాజు, డి టి వేణు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు



Next Story