అబద్దాలతో పబ్బం గడుపుతున్నారు.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..

by Disha Web Desk 20 |
అబద్దాలతో పబ్బం గడుపుతున్నారు.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య..
X

దిశ, నకిరేకల్ : అబద్దాలతో, అసత్య ప్రచారాలతో దేశంలో బీజేపీ నాయకులు పబ్బం గడుపుతున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బీజేపీ నాయకుల సిగ్గుమాలిన చేతులతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు. రాష్ట్రంలో మోడీ పర్యటన కేవలం కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడానికా అంటూ ప్రశ్నించారు. దొంగలను, రౌడీలను ప్రోత్సహించడం మొదటి నుండి బీజేపీకి అలవాటన్నారు. పదవతరగతి ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన లీకు వీరుడు బండి సంజయ్ ని మెచ్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మోడీ పాలన ఆదానీ, అంబానీలకు మాత్రమే మేలు జరుగుతుందన్నారు.

నిత్యవసర సరుకుల ధరలు పెంచిన ఘనత మోడీకే దక్కుతుందని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని జీర్ణించుకోలేకనే అనవసరమైన అభండాలు మాట్లాడారని వెల్లడించారు. దేశమంతా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. మోడీ పాలనను దేశ ప్రజలంతా గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బండిసంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్ లకు రాబోయే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. అధికారిక కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనంగా ఉత్తమ గ్రామపంచాయతీల అవార్డులు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed