- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆహార భద్రత నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలి

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫుడ్ సేఫ్టిని అందరి సమిష్టి బాధ్యతగా తీసుకోవాలని, సురక్షిత ఆహారం అందించడంలో అధికారులు అందరు సమన్వయంగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో కలిసి డిస్ట్రీక్ లెవెల్ ఫుడ్ సేఫ్టీ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లడుతూ.. జిల్లాలో ప్రజలకు అందించే ఫుడ్ విధానాలపై ఈ కమిటీ విప్లవాత్మక నిర్ణయాలను తీసుకుందని చెప్పారు. ప్రజలకు, ఆహారం అందించే హోటల్లలోను, హాస్టల్స్, పాఠశాలలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, పాల కేంద్రాలు బేకరీలు, స్వీట్ హౌస్లు, ఇతరత్ర కేంద్రాలలో అందించే ఆహార పదార్థాలలో ఎలాంటి కల్తీ జరగకూడదని ఆదేశించారు. రంగులను కానీ, నాణ్యత లోపించిన పదార్థాలు, నూనెలు,కుళ్లిపోయిన పదార్థాలు, కల్తీ పాలు, కూరగాయలకు రంగులు అద్దడం చేసిట్లయితే చట్టరీత్యా తప్పక శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రజలకు అందించే ఆహార పదార్థాలు కల్తీ లేకుండా ఆరోగ్యవంతమైనవిగా శుభ్రమైనవిగా ,నాణ్యమైనవిగా అందించాలన్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ పొందిన ఆహార పదార్థాలను ప్రజలకు అందించాలని, ఆర్గానిక్ ఫుడ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు దాని వైపు మొగ్గు చూపాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్వో డాక్టర్ మనోహర్, జిల్లా సేఫ్టీ అధికారి స్వాతి, సుమన్ కళ్యాణ్, డీఏవో, డిప్యూటీ సివిల్ సప్లై అధికారిణి రోజా రాణి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.