ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు లేకుండా ఎన్నిక‌లు నిర్వ‌హించాలి : ఆర్డీవో శ్రీదేవి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-29 09:18:22  IST  )

దిశ‌, మ‌ర్రిగూడ (నాంప‌ల్లి) : ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ లో ఎలాంటి అవకతవకలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని చండూరు త‌హ‌శీల్దార్ శ్రీదేవి పేర్కొన్నారు.ఈనెల 11న జరిగే

ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు లేకుండా ఎన్నిక‌లు నిర్వ‌హించాలి : ఆర్డీవో శ్రీదేవి
X

దిశ‌, మ‌ర్రిగూడ (నాంప‌ల్లి) : ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ లో ఎలాంటి అవకతవకలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని చండూరు ఆర్డీవో శ్రీదేవి పేర్కొన్నారు.ఈనెల 11న జరిగే గ్రామపంచాయతీ పోలింగ్ పై శనివారం ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కు అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీదేవి మాట్లాడుతూ పోలింగ్ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సమర్థవంతంగా పోలింగ్ నిర్వహించాలని ఆమె కోరారు. మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో ఎలక్షన్ నిర్వాణపై మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ, నాంపల్లి ఎంపీడీవోలు మునయ్య, ఆర్కే శర్మ, త‌హ‌శీల్దార్లు జక్కర్ది శ్రీనివాస్, దేవా సింగ్, ఎంఈఓ లు, ఎంపీవోలు పాల్గొన్నారు.

Next Story