- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గందరగోళానికి గురై అదుపుతప్పిన ద్విచక్ర వాహనం.. వ్యక్తి మృతి

దిశ, అనంతగిరి : జాతీయ రహదారిపై గందరగోళానికి గురై ద్విచక్ర వాహనం నుండి కింద పడ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన అనంతగిరి మండలం శాంతినగర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్సై నవీన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం....యానాది గ్రామము చామర్రు, అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా కు చెందిన యాటగిరి సందయ్య (38), ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జీళ్ళ చెరువు గ్రామం నందు గల నర్సరీ నందు పనిచేయుట వెళ్లే క్రమంలో శుక్రవారం సాయంత్రం శాంతినగర్ గ్రామ శివారులోకి వచ్చేసరికి శాంతినగర్ గ్రామ ఫ్లైఓవర్ వద్ద సర్వీస్ రోడ్డు మీదుగా వెళ్లాలా లేక ఫ్లైఓవర్ నుంచి వెళ్లలా అనే గందరగోళం కి గురై తను నడుపుతున్న మోటార్ సైకిల్ నుండి క్రింద పడిపోగా తలకు బలమైన గాయం అయింది. హైవే వాహనం వారు కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుండి మృతుని కుటుంబ సభ్యులు సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లుగా తెలిపారు., మృతిని అన్న అంకమరావు దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.